Advertisement
దత్తాత్రేయుని అవతరణం
భక్త బృంద భవతారణం
సద్గురు సాధమ సంగమం
సదానంద హృదయంగమం
ఎలావున్నాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది
పరమ పతివ్రతా ఎవరని పార్వతి పరమేశుని అడిగింది
బ్రహ్మ మానస పుత్రుడైన ఆ అత్రిమహాముని పత్ని
అనసూయ పరమ సాధ్వి అని పలికెను ఉమాపతి
అది విని రగిలిన ముగురమ్మలు అసూయ జలధిని మునిగి
అనసూయని పరీక్షింపగా తమ తమ పతులను పంపిరి
దత్తాత్రేయుని అవతరణం
భక్త బృంద భవతారణం
సద్గురు సాధమ సంగమం
సదానంద హృదయంగమం
Advertisement
అతిధి రూపములు దాల్చిన మువ్వురు మూర్తులనాసతి కొలిచినది
దిగంబరంగా వడ్ఢయింపుమనిన దిగపతులను చూచి దిగ్బ్రాంతి చెందినది
కాల మూర్తులని చంటి పాపాలుగా మార్చి వివస్త్రగ వెలిగినది
పరమ సాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించింది
పతులు పసి పాపలైరని తెలిసి లక్ష్మి సరస్వతి పార్వతులు పరితపించిరి
ఘొల్లుమనుచు పతి భిక్ష పెట్ట్టామని కొంగు చాచి యాచించిరి
అనసూయ పాతివ్రత్యముతో పలుకులొకటిగా బాసిలిరి
తమ తమ పతులెవరో తెలియక ముగ్గురామ్మరే మొరలిడిరి
ముగ్గురు మూర్తులకు ముగ్గురమ్మలకు ఇచ్చి అనసూయ అత్తయైనది
బ్రహ్మ విష్ణు పరమేశ్వరులంశా అత్రిముని దత్తమైనది
అత్రిముని దత్తమైనది
దత్తాత్రేయుని అవతరణం
భక్త బృంద భవతారణం
సద్గురు సాధమ సంగమం
సదానంద హృదయంగమం
సృష్టి స్థితిల కారకులౌ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు
ఒకే దేహమున వరలాగా
అన్ని ధర్మముల ఆలవాలంగా ఆవు పృష్ఠమున అలరాగా
నాలుగు వేదముల నడవడిగా నాలుగు శునకముల నానుడిగా
సమర్థ సద్గురు వంశమే ఆ దత్తుని ఐదు వంశములై
ధారా వెలిగే ధర్మ జ్యోతులుగా
ధారా వెలిగే ధర్మ జ్యోతులుగా